Wednesday, 28 October 2020

‘వకీల్ సాబ్’ శాటిలైట్ రైట్స్.. భారీ ధరకు సొంతం చేసుకున్న ఛానెల్!

పవర్ స్టార్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచనున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి మొదటిగా రాబోయే చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీల్లో చాలా సినిమాలే విడుదలయ్యాయి. ‘వకీల్ సాబ్’ సినిమా కోసం దిల్ రాజు ముందు కూడా చాలా ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ ఆఫర్లనే ఉంచాయని, కానీ ఆయన అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ‘వకీల్ సాబ్’ శాటిలైట్ హక్కులను భారీ ధరకు సన్ నెట్‌వర్క్ కొనుగోలు చేసిందట. అంటే, జెమిని టీవీలో ‘వకీల్ సాబ్’ దర్శనమిస్తాడన్నమాట. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలు ఆగిపోయిన ‘వకీల్ సాబ్’ షూటింగ్ అక్టోబర్ నెలలోనే మొదలైంది. అయితే, పవన్ కళ్యాణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీని కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించారట. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం పూర్తయిపోతుందని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే టీజర్‌తో ఫ్యాన్స్‌ను పవన్ సర్‌ప్రైజ్ చేయనున్నారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mAsH59
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...