పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఓ చిత్రాన్ని దసరా రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సాగర్ కె.చంద్ర దర్శకుడు. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్'కు చిత్రానికి ఇది రీమేక్. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్ ఈ రీమేక్లో షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది. Also Read: ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా వస్తున్న రూమర్లు మెగా ఫ్యాన్స్కు ఖుషీ చేస్తున్నాడు. ఇందులో రెండో హీరో పాత్రలో దగ్గుబాటి రానా కనిపిస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నితిన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో పవన్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్తో ఆమె నటించిన ‘ఫిదా’ బ్లాక్బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అబ్బాయితో కలిసి అందరినీ ఫిదా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాబాయ్తో జత కట్టనుందన్న వార్త ఫిల్మ్నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుకుతోంది. దీనిపై యూనిట్ అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3moXy4O
v
No comments:
Post a Comment