Thursday, 22 October 2020

వరద బాధితులకు సాయం.. కేటీఆర్‌‌కు చెక్ అందజేసిన హీరో రామ్

భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేశాయి. చెరువులు, నాలాలు పొంగి పొర్లడంతో పాతనగరం మొత్తం నీట మునిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి, నగరాన్ని పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా తెలుగు సినిమా పరిశ్రమ నిలిచింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి అత్యధికంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక కోటి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ 50 లక్షలు, నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, రవితేజ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా రూ. 10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు ఇచ్చారు. వీళ్లతో పాటు హీరో సైతం రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని అందజేస్తున్నట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఈరోజు మంత్రి కేటీఆర్‌కు కలిసిన హీరో రామ్.. రూ.25 లక్షల చెక్కును ఆయనకు అందజేశారు. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dZWtxv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...