సోషల్ మీడియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ తమ అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో తన హిమాలయ ట్రిప్ తాలూకు విశేషాలు చెబుతూ ఆన్లైన్ చాట్ చేశారు. ఈ చాటింగ్లోకి వచ్చిన నవదీప్తో కాసేపు ముచ్చటించింది. వీరిద్దరి సంభాషణలో నవదీప్ తన కోరిక బయటపెట్టడం, దానికి అనసూయ జబర్దస్త్ రియాక్షన్ ఇవ్వడం జనాల్లో హాట్ టాపిక్గా మారింది. టూర్లు, షికార్లు అంటే ఇష్టపడే నవదీప్.. ఇటీవలే తన స్నేహితులతో కలిస్ హిమాలయ ట్రిప్ వేశారు. హైదరాబాద్ నుంచి బైకులపై బయల్దేరి సరదాగా హిమాలయ పరిసర ప్రాంతాలన్నీ చుట్టి వచ్చిన ఆయన ఆ విశేషాలను ఆన్లైన్ వీడియో ద్వారా వెల్లడిస్తూ అభిమానులతో చాట్ చేశారు. ఇంతలో ఈ చాట్ లోకి వచ్చిన అనసూయ.. నవదీప్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ హిమాలయ ట్రిప్ తాలూకు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. Also Read: తనకు కూడా హిమాలయ టూర్ అంటే చాలా ఇష్టమని అనసూయ చెప్పగానే ఇదే అదనుగా ఆమెపై పంచ్ వేశాడు నవదీప్. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటాను. కానీ మీరు అక్కడికి రారు అంటూ నవ్వుతూనే మనసులోమాట బయటపెట్టేశాడు. దీంతో షాకైన అనసూయ వెళదాం.. వెళదాం అంటూ జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే ఆ మ్యాటర్ కట్ చేస్తూ ట్రాక్ మార్చేసి.. మీరిప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా? అంటూ తన సంభాషణ కంటిన్యూ చేసింది. దీంతో వీరిద్దరి ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే సినిమా రంగంలోనూ దూసుకుపోతున్న అనసూయ.. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'రంగమార్తాండ'తో బిజీగా ఉంది. మరోవైపు నవదీప్ సైతం వెండితెరపై విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూనే బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'మోసగాళ్లు'లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dM6i1P
v
No comments:
Post a Comment