Monday, 26 October 2020

మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది: ముఖ్యమంత్రిపై కంగనా ఫైర్

మహారాష్ట్ర సర్కారు, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శివసేన దసరా ర్యాలీ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. Also Read: అసలే మహారాష్ట్ర సర్కారుపై ఆగ్రహంతో ఉన్న కంగనాను ఉద్ధవ్‌ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టాయి. దీంతో తన కోపాన్ని వెళ్లగక్కుతూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయింది. ‘నువ్వు వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చిన నొపొటిజం ప్రొడక్ట్‌వి’ అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ధ్వజమెత్తింది. ‘ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నాకు తిండి కూడా దొరకదని అన్నారు. నాకు మీ కొడుకు వయసుంటుంది. జీవితంలో కష్టపడి ఎదిగిన ఒంటరి మహిళ ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది. ముఖ్యమంత్రి గారూ.. మీరొక చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్` అని ట్వీట్ చేసింది. మరో ట్వీట్‌లో ‘సీఎం గారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాను. కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయి’ అని కంగన ఘాటుగా ట్వీట్ చేసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35sdMTG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...