హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యను నేరుగా విమర్శించకుండా ఆయన చేయని పనులను చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. దీని ద్వారా ఆయనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య విరాళం కూడా. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ నుంచి మొట్టమొదటి సారిగా నందమూరి ముందుకొచ్చారని.. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ.1.5 కోట్లు విరాళంగా ప్రకటించారని రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రమే కాదు చాలా వెబ్సైట్లలో ఈ వార్తలను ప్రచురించారు. కానీ, బాలకృష్ణ తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ఇస్తున్నట్టు కానీ.. బాలకృష్ణ తమకు విరాళం ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై ‘సమయం’ ఆరా తీయగా అసలు బాలకృష్ణ ఈ విరాళం ప్రకటించలేదని తెలిసింది. ఆయనపై బురదజల్లడానికి ప్రయత్నించే ఓ వర్గం సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారం ఇదని తేలింది. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. గతంలోనూ బాలకృష్ణపై ఇలాంటి నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. నిజానికి ఇప్పటి వరకు సినీ పరిశ్రమ నుంచి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందిన విరాళాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రకటించినదే అత్యధికం. ఆయన రూ.1.5 కోట్ల సహాయాన్ని నిన్న ప్రకటించారు. ఆయన తరవాత స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఉన్నారు. వీరిద్దరూ చెరో కోటి రూపాయలు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ రూ.50 లక్షలు, నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, రవితేజ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా రూ. 10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షలు వరద బాధితుల సాయంగా ప్రకటించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37sOUho
v
No comments:
Post a Comment