యంగ్ రెబల్ స్టార్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’కి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ వార్త బయటకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అథర్వా కీలక పాత్ర పోషిస్తున్నాడని, ప్రభాస్కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతున్న సమయంలో లాక్డౌన్ కారణంగా యూనిట్ స్వదేశానికి తిరిగి వచ్చేసింది. Also Read: ప్రస్తుతం లాక్డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ తీసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. వచ్చే నెల రామోజీ ఫిల్మ్సిటీలో మొదలయ్యే షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. లాక్డౌన్ సమయంలో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేసింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ‘సాహో’ నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3irCZTz
v
No comments:
Post a Comment