Sunday, 13 September 2020

అడవులను చుట్టేస్తున్న బన్నీ.. ‘పుష్ప’ షూటింగ్ జరిగేది అక్కడేనా?

స్టైలిష్ స్టార్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. బన్నీ-సుక్కు కాంబినేషన్లో ఆర్య, ఆర్య-2 తర్వాత ముచ్చటగా మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. Also Read: ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్‌ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగంగ అడవుల్లోనే జరగాల్సి ఉంది. అందుకోసం కేరళ ఫారెస్ట్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ వేయగా కరోనాతో బ్రేక్ పడింది. ఇటీవల కాలంలో పరిస్థితులు కాస్త షూటింగ్‌ కొనసాగిద్దామనుకున్నా ఆ రాష్ట్రంలోని నిబంధనలు అడ్డుపడుతున్నాయి. దీంతో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసినా మళ్లీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. Also Read: ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీతో పాటు ‘పుష్ప’ యూనిట్ సభ్యులు కూడా అక్కడ పర్యటిస్తున్నారట. షూటింగ్ లోకేషన్‌ వేటలో భాగంగానే చిత్ర యూనిట్ ట్రావెల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎంత ఆలస్యమైనా కేరళ అడవుల్లోనే షూటింగ్ చేయాలని సుకుమార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తుండగా... దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rjxf2m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...