సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత రెండు సరికొత్త చిత్రాలను ప్రకటించారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్లు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులు కావడం విశేషం. సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు చేస్తున్నారు. సతీష్ త్రిపుర చిత్రం ఒక ఉత్కంఠ భరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాగా, అశ్విన్ గంగరాజు చిత్రం ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలు రాయిగా అభివర్ణించవచ్చు. ఆయా చిత్రాల నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారు. ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు ప్రతిభావంతులైన దర్శకులతో చిన్న చిత్రాలు చేస్తూ ప్రోత్సహిస్తోంది. అలాగే, ప్రేక్షకులకు నచ్చే వినోదాత్మకమైన కమర్షియల్ సినిమాలను సైతం అందిస్తోంది. ఈ ఏడాది ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం వెంకటేష్తో ‘నారప్ప’ సినిమాను నిర్మిస్తున్నారు సురేష్ బాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hplm5P
v
No comments:
Post a Comment