Thursday, 10 September 2020

పాత ఫ్రెండ్స్‌ని ఒక్కటి చేసిన డ్రగ్స్ కేసు.. ఒకే గదిలో ఇద్దరు హీరోయిన్ల పడక

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్లు , సంజనా గల్రానీల విచారణ కొనసాగుతోంది. ఒకరోజు వ్యవధిలో అరెస్టయిన ఇద్దరూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిద్దరిని వేర్వేరుగా విచారించడంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. Also Read: మహిళా పోలీసు అధికారిణి కాత్యాయణి నేతృత్వంలో రాగిణి ద్వివేదిని మహిళ సంరక్షణ కేంద్రంలో విచారించగా... మరో అధికారిణి అంజు మాల నేతృత్వంలో మడివాళ ఎఫ్‌ఎల్‌సీ కార్యాలయంలో సంజనా గల్రానీని విచారించారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే కొడుకు, ఇద్దరు నటీమణులు, నలుగురు సీరియల్ ఆర్టిస్టులు, మరికొంతమంది పారిశ్రామికవేత్తల వారసుల పేర్లను సంజన వెల్లడించారు. ఆమె ఇచ్చిన వాంగ్మలం ఆధారంగా మరో పది మందికి సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాగిణి ద్వివేది విచారణలో 26 మంది పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. ఆమె చెబుతున్నది నిజమా? కాదా? అన్నది తేల్చేందుకు పోలీసులు అనేక రిసార్టుల్లో ఆరా తీస్తున్నారు. Also Read: ‘మందు పార్టీల్లో మత్తు పదార్థాలను వినియోగించిన మాట నిజమేనా?’ అనే ప్రశ్న ఎదురైనప్పుడు కంటతడి పెట్టారని పోలీసు వర్గాలు తెలిపాయి. మాదక ద్రవ్యాలను ఎందరో సేవిస్తుంటే నన్నే తప్పు పట్టడమేంటని- నేను కేవలం రుచి చూశానని చెప్పినట్లు తెలిసింది. నాతోపాటు నటించే కొందరు ఇలా మత్తుపదార్థాలు తీసుకోవడం చూశాననీ ఆమె చెప్పుకొచ్చారట. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని సంజనా గల్రానీ విచారణ సమయంలో పోలీసులను డిమాండు చేసినట్లు సమాచారం. Also Read: క్రైమ్ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన సంజనా తన సెల్‌ఫోన్లో ఉన్న సమాచారం, ఫోటోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమాచారాన్ని తిరిగి సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంజన ఐదు సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 42 సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. అలాంటిది ఆమె బెంగళూరులోని ఇందిరానగర్‌లో లగ్జరీ ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఎలా వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రూ.15కోట్లు ఎలా సంపాదించగలిగారు?, ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అని విచారణ సందర్భంగా పోలీసులు సంజనపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో కేపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా రాగిణి, సంజన మధ్య అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. అప్పటినుంచి వారిద్దరు మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ కేసులో వారిద్దరు అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు మంగళవారం రాత్రి మడివాళలోని మహిళా సంరక్షణ కేంద్రంలో ఒకే గదిలో గడిపారు. రాత్రంతా ఒకనొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఎడమొహం... పెడమొహంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఐదుగు పడకల్లో మొదటి, చివరి వాటిని వారిద్దరికి కేటాయించగా.. మధ్యలో ఓ మహిళా కానిస్టేబుల్‌కి కేటాయించారు. నిద్రపోయే సమయంలో లైట్ ఆఫ్ చేసే విషయంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ifP1zy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...