హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే ముంబయిలో మరో నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలు హిందీ సీరియళ్లలో నటించిన అక్షత్ ఉత్కర్ష్(26) ముంబయిలోని తన ఫ్లాట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్కు చెందిన అక్షత్ కొన్నాళ్ల క్రితం ముంబయికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు. తనతో పాటు నటించే ఓ యువతితో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తున్నాడు. Also Read: ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కి వెళ్లిన అక్షత్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు వచ్చి బాత్రూమ్ తలుపు తీసి చూడగా అతడు విగతజీవిగా పడివున్నాడు. దీంతో పోలీసులు అక్షత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. Also Read: అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అక్షత్ తల్లిదండ్రులు అంటున్నారు. అతడు మానసిక ఒత్తిడికి గురై చనిపోలేదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం అక్షత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G8neDe
v
No comments:
Post a Comment