Friday, 25 September 2020

బాలు క్షేమంగా తిరిగి రావాలని పూజలు చేశా.. కానీ ఫలించలేదు: బాలకృష్ణ

ప్రసిద్ధ గాయకుడు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ హీరో, ఎమ్మెల్యే అన్నారు. తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమించారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. బాలు మరణంపై ప్రగాఢ సంతాపం తెలుపుతూ బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. Also Read: ‘తన గాత్రంతో అందరినీ అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను రోజూ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేశాను. కానీ ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఎస్పీ బాలసుబ్రమణ్యంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. Also Read: నాన్నగారు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన సుమధుర గానం అందించారు. చిత్రం భళారే విచిత్రం అంటూ గంభీరమైన స్వరంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. ఎస్పీబీ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.’ అంటూ నందమూరి బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. ఫోటోస్: Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kKMcqY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...