Tuesday, 1 September 2020

ఒకే ఒక్క షెడ్యూల్‌లో రకుల్‌తో సినిమా పూర్తిచేస్తోన్న క్రిష్

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్‌ల హడావుడి మొదలవుతోంది. షూటింగ్‌లకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చి నెల రోజులకు పైగా అయినా స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పటి వరకు షూటింగ్‌ల్లో పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్‌లు మొదలుపెట్టలేదు. అయితే, ప్రస్తుతం మెల్లమెల్లగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ నిన్న (ఆగస్టు 31న) తిరిగి ప్రారంభమైంది. సాయి తేజ్, నభా ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, టాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వైష్ణవ్ తేజ్‌తో కలిసి తాను నటిస్తోన్న సినిమా షూటింగ్‌లో రకుల్ జాయిన్ అయ్యారు. వికారాబాద్ ఫారెస్ట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకే ఒక్క షెడ్యూల్‌లో కేవలం 40 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నిన్నటి నుంచి రకుల్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read: ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసిన తరవాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌ను క్రిష్ తిరిగి ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌కు ముందు ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. కాగా, రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సర్‌ప్రైజ్ రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34TwHII
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...