సినిమా హీరోలు ఇటీవల రియల్ లైప్లోనూ హీరోలుగా మారుతున్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా కొందరు నటులు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు సోనూసూద్ చేసిన సేవలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. ఆయనలా కాకపోయినా చాలామంది హీరోలు, హీరోయిన్లు సమాజానికి తమకు చేతనైనంత సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ కోవలోనే హీరో కార్తి(సూర్య తమ్ముడు) ఓ మంచి పని చేసి శభాష్ అనిపించుకున్నారు. Also Read: సూర్య, కార్తి సినిమాలు చేయడంతో పాటు సమాజ సేవలోనూ పోటీ పడుతున్నారు. తెలుగులోనూ వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వాళ్ల ప్రతి సినిమా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అసలు విషయానికొస్తే.. తిరునెల్వేలి జిల్లా రాధాపురంలోని శూరావలి కాలువ నమ్ముకుని ఎంతో మంది రైతులు వ్యవసాయం చేస్తుంటారు. కొంతకాలంగా పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహం మందగించింది. దీంతో రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. Also Read: ఈ విషయం సోషల్మీడియా ద్వారా తెలుసుకున్న కార్తి వెంటనే స్పందించారు. 13 కిలోమీటర్ల మేర కాలువలో పూడిక తీయించారు. 21 రోజుల పాటు సాగిన మరమ్మతుల పని కోసం కార్తి 4లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆయన సంపాదనతో పోల్చుకుంటే ఆ మొత్తం చిన్నదైనప్పటికీ.. రైతులు, ప్రజల సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించిన కార్తిని అక్కడి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HedfMT
v
No comments:
Post a Comment