ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేసిన విషయం తెలిసిందే. తన పెద్ద కుమారుడు కాల భైరవతో కలిసి హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ప్లాస్మాను దానం చేశారు. ఆ మధ్య కరోనా బారిన పడిన కీరవాణి కుటుంబం తరవాత కోలుకుంది. ప్లాస్మా దానంపై అవగాహన కలిగిస్తూ సైబరాబాద్ పోలీసులతో కలిసి పాటను రూపొందించిన కీరవాణి.. ఇప్పుడు కుమారుడితో కలిసి ప్లాస్మా దానం చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇదిలా ఉంటే, యం.య.కీరవాణి కుటుంబంతో పాటు ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు కుటుంబం కూడా కరోనా బారిన పడింది. నిజానికి కీరవాణి కన్నా ముందే రాజమౌళి ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. త్వరలోనే కోలుకుని ప్లాస్మా దానం చేస్తామని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తరవాత కూడా డాక్టర్ సూచన మేరకు ప్లాస్మా దానం చేస్తానని స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు ఆయన ప్లాస్మా దానం చేసే పరిస్థితిలో లేరు. దీనికి కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. Also Read: ప్లాస్మా దానం చేయాలంటే దాత రక్తంలో ఇమ్యునోగ్లోబులిన్ జి (igG) యాంటీబాడీస్ 15 పాయింట్ల కంటే అధికంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాజమౌళి రక్తంలో igG లెవెల్స్ 8.62గా ఉన్నాయట. అందుకే, తాను ప్లాస్మాను దానం చేయలేకపోతున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన పెద్దన్నయ్య (కీరవాణి), భైరవ ఈరోజు ప్లాస్మా దానం చేశారని తెలిపారు. శరీరంలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్ కొంత కాలంపాటే దేహంలో ఉంటాయని రాజమౌళి చెప్పారు. కొవిడ్ 19 నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని, ప్రాణదాతలు కావాలని రాజమౌళి అభ్యర్థించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gLo98T
v
No comments:
Post a Comment