సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సినిమా తీయడానికి వందల పేజీల బౌండెడ్ స్క్రిప్ట్ అవసరంలేదు. చిన్న స్టోరీలైన్ ఉంటే చాలు.. ఆయన అల్లుకుపోతారు. ఇప్పటి వరకు అలా అల్లుకుపోయిన సినిమాలు చాలానే వచ్చాయి. సమాజంలో వివాదాలకు తావిచ్చే, విమర్శలకు దారితీసే అంశాలు, ఘటనలపై మాత్రమే ఈమధ్య వర్మ సినిమాలు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన రాజకీయ అంశాలు, వ్యక్తులపై ఇప్పటికే వర్మ సినిమాలు తీశారు. ఇప్పుడు తెలంగాణలోని మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతంపై సినిమా చేస్తున్నారు. దానికి ‘మర్డర్’ అని పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా గురించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా వర్మ మరో వివాదాస్పద అంశంపై కన్నేశారని టాక్. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పెట్టిన కేసు ఆధారంగా వర్మ సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. Also Read: తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తరవాత అదంతా అబద్ధమని.. ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోన్న వ్యక్తి బలవంతం మేరకు ఈ కేసులు పెట్టానని ఆ యువతి మీడియా ముందు అంగీకరించడం తెలిసిందే. ఈ కేసు గురించి ఆ యువతి మీడియా ముందుకు వచ్చిన తరవాత ఈ కథను సినిమాగా తీయాలనే ఆలోచన వర్మలో వచ్చిందని టాక్. ఈ 139 మందిలో టీవీ, సినిమా, జర్నలిజం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం వల్ల ఈ కథ అయితే ప్రజల్లోకి బాగా వెళ్తుందని వర్మ అంటున్నారట. ఇప్పటికే వర్మ డైరెక్షన్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి దీనిలో నిజమెంతో తెలియాలి అంటే వర్మ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jr3mJA
v
No comments:
Post a Comment