Tuesday, 22 September 2020

‘లూసిఫర్’ రీమేక్‌లో హీరోయిన్, పాటలు.. అందుకే మరింత ఆలస్యం!!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ చిత్ర రీమేక్ బాధ్యతలను యంగ్ డైరెక్టర్, ‘సాహో’ ఫేమ్ సుజీత్‌కు అప్పగించారు. అయితే, సుజీత్ చేసిన మార్పులు చిరంజీవికి నచ్చలేదని, దీంతో ఆయన ఈ రీమేక్‌ను వి.వి.వినాయక్‌ చేతిలో పెట్టారని వార్తలు వచ్చాయి. తనతో ఇప్పటికే ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ రీమేక్‌లు చేయడంతో చిరంజీవి మళ్లీ వినాయక్‌పైనే నమ్మకం ఉంచారట. అయితే, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం వి.వి.వినాయక్ ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదు. మలయాళం స్క్రిప్ట్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేయకుండానే ఒక మంచి కమర్షియల్ సినిమాలా దీన్ని మలిచేందుకు వినాయక్ చూస్తున్నారట. చిరంజీవికి హీరోయిన్‌ను పెట్టడం, అలాగే సాంగ్స్ కూడా జతచేయాలని వినాయక్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. నిజానికి మలయాళం వర్షన్‌లో మోహన్‌లాల్‌కు హీరోయిన్ లేదు. అలాగే, పాటలు కూడా లేవు. కానీ, చిరంజీవి సినిమా అనగానే అభిమానులు మంచి పాటలు, వాటికి తగ్గ స్టెప్పులు ఆశిస్తారు. అందుకే, ఈ పొలిటికల్ డ్రామాలో హీరోయిన్‌ను, పాటలను చొప్పించాలని వినాయక్ చూస్తున్నారని అంటున్నారు. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమవుతోందని టాక్. ‘లూసిఫర్’ రీమేక్ ఆలస్యం అవుతుండటంతో మెహర్ రమేష్ సినిమాను చిరంజీవి ముందుకు తీసుకొచ్చారని సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తికాగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాను చిరు మొదలుపెడతారు. ఇక ‘లూసిఫర్’ రీమేక్ 2021 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZYu7Oa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...