Wednesday, 9 September 2020

బ్రేకింగ్: ముంబైలో అడుగుపెట్టిన కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. హై సెక్యూరిటీ ‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ కేసుకు సంబంధించిన విచారణలో పోలీసుల తీరును తప్పుబట్టడమే గాక నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. దీంతో ఈ ఇష్యూ పలు వివాదాలకు దారితీసింది. ఈ క్రమంలో ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగు పెట్టొద్దని కొందరు శివసేన నేతలు ఆమెను హెచ్చరించారు. దానిపై రియాక్ట్ అయిన కంగనా ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అని బహిరంగ సవాల్ విసిరి ఈ రోజు (సెప్టెంబర్ 9) ముంబై చేరుకుంది. చెప్పినట్లుగానే ఈ రోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్ నుంచి బయల్దేరిన కంగనా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముంబైలో ల్యాండ్ అయింది. కంగనా వస్తుందని తెలిసి పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. కంగనా సవాల్‌పై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ముంబై లోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై క్యాటగిరి భద్రతతో కొద్ది సేపటి క్రితమే కంగన రనౌత్‌ ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. Also Read: మరోవైపు కర్ణిసేన కార్యకర్తలు కూడా కంగనాకు సెక్యూరిటీగా ఉన్నారు. మొత్తానికి ముంబైలో అడుగుపెట్టిన కాంట్రవర్సీ క్వీన్ కంగనా హై సెక్యూరిటీ నడుమ తన నివాసానికి చేరుకుంది. కంగనా వెంట ఆమె సోదరితో పాటు వ్యక్తిగత సిబ్బంది ఉన్నారని తెలిసింది. ఇదిలా ఉంటే నేటి ఉదయం ముంబై బంద్రాలో ఉన్న కంగనా రనౌత్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేసింది బీఎంసీ. అయితే ఈ కూల్చివేతపై స్టే విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించిన కంగనాకు కాస్త ఊరట కలిగింది. కూల్చివేతపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R91ZDc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...