రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభాస్.. ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటడమే కాకుండా, వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుంటానని అప్పట్లో ప్రకటించారు. చెప్పినట్టుగానే హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే గ్రామంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలో ఖాజీపల్లి అర్బ్ ఫారెస్ట్ బ్లాక్లో 1650 ఎకరాల అటవీ భూమిని ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తన తండ్రి దివంగత U.V.S. రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతానికి రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్.. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కుకు సోమవారం శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన అనంతరం ప్రభాస్, ఎంపీ సంతోష్ కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Also Read: Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZgYWgy
v
No comments:
Post a Comment