ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి, కుదుపులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రముఖ దర్శకుడు ఢమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనురాగ్, పైసా వసూల్ ఫేమ్ ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హరిణి ఆరాధ్య క్రియేషన్స్, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక, కృష్ణ కుమార్లు నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాధాకృష్ణ’ ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే రాధా కృష్ణ ఫస్ట్ సింగిల్ను ఇస్మార్ట్ డైరెక్టర్ గారు ఆగస్ట్ 22న విడుదల చేయనున్నారు. డమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి గారి సమర్పణలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది'' అన్నారు. అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aH2QDU
v
No comments:
Post a Comment