Tuesday, 4 August 2020

అమృత నోటీసులపై స్పందించిన ‘మర్డర్’ నిర్మాతలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మ‌ర్డర్’. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తండ్రీకూతుళ్లు మారుతీరావు, అమృతల మధ్య అనుబంధాన్ని.. ఆ తరవాత ప్రణయ్‌తో అమృత ప్రేమ.. ప్రణయ్ హత్య చుట్టూ ‘మర్డర్’ కథను అల్లారు. అయితే, ఈ సినిమాపై అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా తనపై సినిమా తీస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిర్మాతల నుంచి సమాధానం కోరుతూ ఆమె కోర్టు ద్వారా నోటీసులు పంపారు. రామ్ గోపాల్ వర్మకు కాకుండా చిత్ర నిర్మాత నట్టి కరుణ డాటర్ ఆఫ్ నట్టి కుమార్‌కు అమృత నోటీసులు పంపారు. ఈనెల 6న నల్గొండ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నా ఆయనకు నోటీసులు పంపలేదు. Also Read: అయితే, ఈ నోటీసులపై నిర్మాత కరుణ స్పందించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని ఆమె తెలిపారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుందన్నారు. ఈ నెలలోనే సెన్సార్‌కు పంపుతామని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం డీఎస్ఆర్ సమకూరుస్తుండగా, జగదీష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి తదితరులు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BXbXDL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...