వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సంస్థ కొద్ది రోజుల్లో ‘మర్డర్’ అనే సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఘటన యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆ సినిమా పట్ల మంగళవారం అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరుల జీవితాలతో సినిమా దర్శకుడు, నిర్మాత చెలగాటమాడుతున్నారని అమృత మండిపడ్డారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని తప్పుబట్టారు. రెండేళ్ల క్రితం ప్రణయ్ హత్య ఘటన, ఐదు నెలల క్రితం మారుతీరావు ఆత్మహత్య ఘటనతో తాము తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో మర్డర్ సినిమాను తీసి వర్మ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు వాపోయారు. మర్డర్ సినిమాను దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అనే పాటను సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అమృత ప్రణయ్ సహా కుటుంబ సభ్యులు స్పందించారు. Also Read: ఆగస్టు 6న విచారణ అయితే, మర్డర్ చిత్రంలో తమ పేర్లు, ఫోటోలు అక్రమంగా వాడుకున్నారని, తమ అనుమతి లేకుండా తీసిన ఈ సినిమాను నిలిపివేయాలని గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో అమృత ప్రణయ్, కుటుంబ సభ్యులు వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో మెయిల్ ద్వారా కోర్టు దర్శకుడికి, నిర్మాతకు నోటీసులను మెయిల్ చేసింది. ఈ నెల 6న నల్గొండ కోర్టులో దర్శకుడు, నిర్మాత విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. Don't Miss:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33oy3dy
v
No comments:
Post a Comment