బాలీవుడ్ యంగ్ హీరో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు నెలల క్రితం (జూన్ 14వ తేదీన) సుశాంత్ సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్త సంచలనం అయింది. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ సూసైడ్ వెనుక ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సుశాంత్తో టచ్లో ఉన్న ప్రతిఒక్కరినీ విచారిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ అనే వ్యక్తి ఓ సంచలన విషయం వెల్లడించినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. సుశాంత్కి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఆయన తరచుగా సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగేవాడని నీరజ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కోణాల్లో హౌస్కీపర్ నీరజ్ సింగ్ను ప్రశ్నించగా ఆయన ఈ విషయం రివీల్ చేసినట్లు సమాచారం. Also Read: సుశాంత్ తన ఇంట్లోనే రియా, ఫ్రెండ్స్తో కలిసి వారానికి రెండు లేదా మూడు సార్లు పార్టీ చేసుకునేవాడని, ఆ సమయంలో మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లను ఉపయోగించేవాడని నీరజ్ సింగ్ వెల్లడించాడని అంటున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కూడా గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని, అయితే ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయని నీరజ్ ముంబై పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సూసైడ్ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని సెంటర్ పాయింట్గా తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ మధ్యనే రియా- మహేష్ భట్ వాట్సాప్ చాట్ బయటపడటంతో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. చూడాలి మరి సీబీఐ ఎంక్వైరీలో ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటకొస్తాయో!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CP4NSi
v
No comments:
Post a Comment