Tuesday, 11 August 2020

ఏకంగా ఓటర్లనే టార్గెట్ చేసిన నాగబాబు.. ఆ హక్కు మీకు లేదంటూ షాకింగ్ కామెంట్స్

గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న మెగా బ్రదర్ మరోసారి దుమారం రేపే కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. మెగా ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయ, సామాజిక కోణంలోనూ స్పందిస్తూ ఈ మధ్యకాలంలో పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు నాగబాబు. ఈ క్రమంలోనే తాజాగా ఓటర్లను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసి సరికొత్త చర్చలకు తెరలేపారు. ముందుగా ''రాష్ట్రంలో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు'' అంటూ షాకింగ్ ట్వీట్ చేసిన నాగబాబు.. ఆ తర్వాత ''కష్ట సమయంలో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40% ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు'' అని పేర్కొంటూ మరో ట్వీట్ చేసి చర్చల్లో నిలిచారు. Also Read: ఎన్నికలు జరిగిన చాలాకాలం తర్వాత.. ఎన్నికల్లో ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండిపోయిన వారిని, డబ్బు తీసుకుని ఓటు వేసిన వారిని నాగబాబు ఇలా విమర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ వెంటనే రాజకీయ నాయకులను తికమక పెట్టేస్తూ.. ''నువ్వు చేసిన తప్పు నీకు గుర్తు చేస్తే ఉలిక్కి పడి భుజాలు తడుముకుంటున్నావే ..? గుమ్మడి కాయల దొంగ'' అంటూ మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ట్వీట్స్‌పై నెటిజన్స్ పెద్దఎత్తున స్పందిస్తూ వారి వారి అభిప్రాయలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరనేది నాగబాబు ప్రస్తావించకపోవడంతో ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాలు మిమ్మల్నే అంటే మిమ్మల్నే అన్నాడంటూ పోట్లాట షురూ చేశారు. మొత్తంగా చూస్తే నాగబాబు చేసిన ఈ ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో ట్విస్టులుగా మారాయనేది మాత్రం చెప్పుకోదగిన విషయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kJ0Pfk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...