మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ హీరోలుగా రూపొందిన మూవీ మలయాళీ భాషలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను రీమేక్ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ చేజిక్కించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీని నిర్మిస్తున్నా రామ్ చరణ్. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పై ఉండగా.. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. అయితే ఈ మూవీ ముగిసిన వెంటనే ‘లూసిఫర్’ సెట్స్పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరల్లో లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఒరిజినల్ వర్షన్లో సీఎం అయిన సచిన్ కేడ్కర్ మరణించిన తర్వాత అతడి వారసుడిగా టోవినో థామస్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని సీఎం కావడానికి సమర్ధుడిగా చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తాడు మోహన్ లాల్. ఇప్పుడు తెలుగు రీమేక్లో ఆ పాత్రను పవన్తో చేయించాలనే ప్రయత్నాలు జరుగుతుండగా.. జగపతి బాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇందులో జగపతి బాబు పాత్ర ఏంటన్నది సీక్రెట్ కాగా.. దర్శకుడు సుజీత్ ఇప్పటికే జగపతి బాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ‘సైరా’ చిత్రంలో చిరుతో కలిసి వీరారెడ్డిగా స్క్రీన్ షేర్ చేసుకున్న జగపతిబాబు మరోసారి చిరు క్రేజీ ప్రాజెక్ట్లో కనిపించబోతున్నారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eZ60UZ
v
No comments:
Post a Comment