చిన్నారి జీవితాన్ని చిదిమేశారు మానవ మృగాలు. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. తమిళనాడు రాష్ట్రం పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన ఏడేళ్ల బాలికను ముగ్గురు దుండగులు అత్యాచారం చేసి చంపేశారు. రెండో తరగతి చదువుతున్న చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఎత్తుకుపోయిన మూడు మానవ మృగాలు కామవాంఛను తీర్చుకుని ఆ చిన్నారిని చంపేసి ముళ్లపొదల్లో పడేశారు. అత్యంత దారుణమైన ఈ ఘటనపై తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్తో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ మానవ మృగాల భరితెగింపుని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూ గొంతెత్తింది హీరోయిన్ సాయిపల్లవి. ఆ చిన్నారి మరణంపై భావోద్వేగానికి గురైన .. ‘మానవ జాతిపై ఉన్న ఆశ వేగంగా చచ్చిపోతోంది’ అంటూ ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్లు షేర్ చేసింది. వారిలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారు.. మనకు ఉన్న అధికారం బలహీనులపైనే.. ఎవరు బలహీనంగా కనిపిస్తే వాళ్లపైనే అధికారం చెలాయించి దుర్వినియోగం చేస్తాం. ఇలాంటి దారుణమైన ఘటనలను గుర్తు చేసేందుకే ప్రకృతి మనకొక సందేశాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. మానవజాతి తుడిచిపెట్టుకోవాల్సిందే అని ప్రకృతి గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ దారుణాలు చూడటం కోసమేనా ఇలాంటి దారుణమైన జీవితం. ఇలాంటి ఘటనలు ఉన్న ప్రపంచంలో మరో బిడ్డకు జన్మనిచ్చే అర్హత లేదు. సోషల్ మీడియా ఇలాంటి ఘోరాలు ట్రెండ్ అయినప్పుడే న్యాయం జరిగే రోజు రాకూడదని ప్రార్ధిస్తున్నా. నేరం వెలుగులోకి వచ్చేవి కొన్నే.. గుర్తింపబడని నేరాలు ఎన్నో మరి వాటి విషయం ఏంటి?? ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్న విషయాలు తెలియజెప్పేందుకు హ్యాష్ ట్యాగ్లు పెట్టాల్సి వస్తోంది. ఈ ఆవేదన అంతా ఏడేళ్ల బాలికకు జరిగిన ఘటనపై అని చెప్పడానికే అంటూ #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్ను జత చేసింది సాయి పల్లవి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VKEPFM
v
No comments:
Post a Comment