Friday, 3 July 2020

ప్రస్తుత తరానికి తెలియాలి.. అందుకే నా కూతురిని తీసుకొచ్చా: రేణు దేశాయ్

మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో కొత్తతరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు నటి, దర్శకురాలు రేణు దేశాయ్. ప్రస్తుతం పిల్లలు నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారని.. వారికి మొక్కలు, వనాలు గురించి తెలియడం లేదని ఆమె అన్నారు. అందుకే, వాళ్లకు మొక్కల అవసరం గురించి చెప్పాలని వెల్లడించారు. గురువారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీ‌హిల్స్‌లోని పార్కులో తన కూతురు ఆద్య, ఆమె స్నేహితురాలు యషికతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ మేరకు యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలంజ్‌ను పూర్తిచేశారు. Also Read: మొక్కలు నాటిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు, తనకు ఛాలెంజ్ ఇచ్చిన ఉదయభానుకు రేణు దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇప్పుడున్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్ కల్చర్‌కి అలవాటు పడ్డాం. మన చిన్నతనంలో సొంత ఇళ్లలో ఉండడం వల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకున్నాం. కానీ, ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదు’’ అని రేణు అన్నారు. తన కూతురు ఆద్య, ఆమె స్నేహితురాలు యషిక ఇద్దరినీ ఇక్కడికి తీసుకురావడానికి కారణం.. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి, మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని తెలపటం కోసమేనని రేణు వెల్లడించారు. ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. పిల్లలకు తమ చేతులతో మొక్కలు నాటడం నేర్పించాలని పిలుపునిచ్చారు. తాను ఈ ఛాలెంజ్‌కు మరో ముగ్గురిని నామినేట్ చేయడం లేదని.. ప్రజలందరికీ ఈ ఛాలెంజ్ ఇస్తున్నానని రేణు చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZzOO1R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...