జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలీవుడ్ నటి మీరా చోప్రా మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. ఎన్టీఆర్ అభిమానులు తనపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మీరా చోప్రా బుధవారం ట్విటర్ ద్వారా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్ పోలీస్లోని సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ జరుపుతున్న క్రమంలో నటి మీరా చోప్రా ట్విటర్లో అధిక సంఖ్యలో ట్వీట్లు ఉన్నాయి. అందులో ఓ 8 ట్విటర్ ఖాతాల నుంచి మీరాకు అసభ్యకరమైన, బూతులతో కూడిన కామెంట్లు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ట్విటర్ ఖాతాలన్నీ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన పేర్లతోనే ఉన్నాయి. వీటిని ఆయన అభిమానులు క్రియేట్ చేసినట్లుగా గుర్తించారు. అయితే, ఇప్పటికే వీరిపై ఐటీ చట్టంలోని 67, 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం మీరా చోప్రా ఢిల్లీలో నివసిస్తున్నారు.ఇటీవల #AskMeera అనే హ్యష్ ట్యాగ్తో మీరా చోప్రా నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా తనకు ఇష్టమైన హీరో మహేశ్ బాబు అని ఆమె చెప్పారు. అయితే, ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చోప్రా సమాధానం ఇవ్వడం ఈ దుమారానికి దారి తీసింది. ఆమె తీరుపై ఎన్టీఆర్ అభిమానులు మండిప్డడారు. మీరా చోప్రాని ట్రోల్ చేస్తూ, ప్రస్తావించేందుకు వీలు లేని బూతులు వాడుతూ ట్వీట్లు చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతేకాక, ఇలాంటి అభిమానులతో ఎలా నెగ్గుకురాగలరో తెలపాలని జూనియర్ ఎన్టీఆర్ను ట్విటర్లో ప్రశ్నించింది.
What does it mean? https://t.co/fqUfqVpZR6
— meera chopra (@MeerraChopra) 1591292050000
మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లింది. తనపై సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి వంటి వాటికి పాల్పడతామని బెదిరిస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై తాను చేసిన ఫిర్యాదును పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కేటీఆర్, కవిత గారూ.. సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి బెదిరింపులు మీ రాష్ట్రంలోని కొందరి నుంచి నాకు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మహిళల భద్రత కోసం ప్రాధాన్యం ఉన్న అంశంగా పరిగణించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.
null
మీరా చోప్రా ఈ ట్వీట్ను శుక్రవారం ఉదయం చేయగా.. మధ్యాహ్నానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై తాను ఇప్పటికే డీజీపీని, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడానని చట్ల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు సమాధానం ఇచ్చారు. ‘‘మేడమ్.. ఈ విషయంపై నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడాను. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారిని కోరాను.’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి స్పందనపై ప్రియాంకా చోప్రా ధన్యవాదాలు తెలిపారు. ప్రియాంకా చోప్రాకు కసిన్ అయిన మీరా చోప్రా తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Also Read:
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టులు.. ఆ 22 మంది ఎవరు?
Also Read: ప్రైమ్ మినిస్టర్ పక్కకెళ్లి మాట్లాడుకోండి.. ప్రధానికి ఇంటి ఓనరు షాక్
Thanks sir, it really means a lot. This is very important for women safety. These people should not be left free to… https://t.co/SJiy0rIbfv
— meera chopra (@MeerraChopra) 1591351597000
@MeerraChopra @hydcitypolice @CyberCrimeshyd @ysjagan @NCWIndia I am surprised that no other actress or Women is no… https://t.co/bPg57CBxxy
— షకలక శంకర్ 🙏🙏🙏 | FC (@Yet2explore) 1591294000000
I have all respect for him as an actor. The only reason iam tagging him is bcoz he should know how his fans behave.… https://t.co/oa70uL1Njj
— meera chopra (@MeerraChopra) 1591123633000
I don’t want any apologies from fans. Tarak should control his fans and he should ask them to restrain from social… https://t.co/PAvnfL8t2t
— Aakashavaani (@TheAakashavaani) 1591183681000
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eUkjtG
v
No comments:
Post a Comment