Wednesday, 3 June 2020

క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే.. కేరళ పైశాచిక ఘటనపై అనసూయ రియాక్షన్

కేరళ రాష్ట్రంలో ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. గర్భంతో ఉన్న గజరాజుకు పైనాపిల్ ఆశ చూపి కిరాతకానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని మలప్పురంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన గురించి తెలిసి ప్రతీ ఒక్కరి గుండె పగులుతోంది. పైశాచిక గుణంతో కొందరు వ్యక్తులు ఊళ్ళో నుంచి వెళ్తున్న ఆడ ఏనుగుకు టపాసులతో నింపిన పైనాపిల్ తినిపించారు. ఆశగా ఆ పండు తిన్న ఏనుగు నోటిలోనే పేలుడు సంభవించడంతో నోటి నిండా, తొండానికి గాయాలై విలవిలలాడిపోతూ ప్రాణాలు విడిచింది. పైగా ఆ ఏనుగు గర్భంతో ఉండటంతో ఈ ఘటన అందరి హృదయాలను చెమర్చింది. ఈ ఉదంతంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అట్టి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిపై విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ, శ్రధ్ధా కపూర్, రణ దీప్ హుడా, దిశా పటానీ, అలియా భట్ వంటివారు ఈ చర్యను ఖండిస్తూ ట్వీట్స్ చేయగా.. తాజాగా యాంకర్, సినీ నటి తనదైన కోణంలో రియాక్ట్ అయింది. కేరళ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ట్వీట్ చేసింది అనసూయ. పిటిషన్‌పై మేమంతా సంతకం చేస్తామని తెలిపింది. ''ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా మానమంతా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నామనిపిస్తోంది. మానవజాతి అనేదే ఒక చెత్త రకం. అడవి దైవంతో సమానం. నాగరికత దెయ్యాల కుంపటిగా తయారైంది. నిజంగా ఈ ఘటన తీవ్ర మనో వేదనను కలిగిస్తోంది'' అంటూ అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెద్దఎత్తున నెటిజన్స్ స్పందిస్తూ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cy2ChQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...