‘’ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ముఖ్యంగా మహేష్ మెడపై రూపాయి కాయిన్ టాటూ ఇప్పుడు యూత్లో ట్రెండ్గా మారింది. ఇప్పటికే ఫ్యాన్స్ మెడపై రూపాయి కాయిన్ టాటూ వేయించుకోవడం కోసం ముచ్చటపడుతున్నారు. ‘గీతగోవిందం’ చిత్రంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అందించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో మరో హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుండగా.. ఈ చిత్రంలో మహేష్కి సరైన జోడీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా అనే కాదు.. మహేష్ బాబు ఏ చిత్రమైనా హీరోయిన్ ఎంపిక అనేది దర్శకులకు పెద్ద టాస్క్గా మారింది. మహేష్ అందం ముందు ఎలాంటి అందగత్తె అయినా తేలిపోయే ప్రమాదం ఉండటంతో ఆయనకు జోడీ వెతకడం పెద్ద పనే. అయితే ‘సర్కారు వారి పాట’ చిత్రానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హీరోయిన్స్ రిపీట్ చేయడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు.. ప్రస్తుతం క్రేజ్లో ఉన్న రష్మిక , పూజా హెగ్డేలతో మహర్షి, సరిలేరు చిత్రాలను చేయడంతో కొత్త హీరోయిన్ వేట ప్రారంభించారు. అయితే భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ఆడియన్స్కి చేరువైన బాలీవుడ్ బ్యూటీ కియారాను ‘సర్కార్ వారి పాట’ చిత్రానికి రిపీట్ చేయబోతోందట చిత్ర యూనిట్. మహేష్ బాబుకి ఫేవరేట్ జోడీ కియారా కావడంతో ఆమెతోనే ‘సర్కార్ వారి పాట’ పాడించేందుకు ఆసక్తిచూపిస్తున్నారట. ఈ చిత్రానికి కియారా దాదాపు ఖాయం కాగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dsprF6
v
No comments:
Post a Comment