Saturday, 6 June 2020

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, మీరా చోప్రా ఇష్యూ: ఇండస్ట్రీ, మీడియా అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

తనను ఎన్టీఆర్ అభిమానులు అసభ్యకర పదజాలంతో ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేసింది మీరా. ఇటీవల ఆన్‌లైన్ వేదికపై చిట్‌చాట్ చేసిన మీరాను ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పమని ఓ అభిమాని అడగగా.. ‘‘ఆయనెవరో నాకు తెలీదు. నేను ఆయన అభిమానిని కాదు’’ అని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై ధ్వజమెత్తడంతో వివాదం ముదిరింది. ఈ ఇష్యూపై ఇటీవలే స్పందించిన సినీ నటి కుష్బూ ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలిచారు. అయితే తాజాగా ఈ వివాదం లోకి పూనమ్‌ కౌర్‌ ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. ఏ హీరో కూడా తన అభిమానులు ఇతరులను ఇబ్బంది పెట్టాలని కోరుకోడని, ఫ్యాన్స్‌ను నిందించడంలో అర్థం లేదని, వాళ్ళు నిజంగా చాలా అమాయకులని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేసింది. ''ఏ యాక్టర్ కూడా తన అభిమానులు వేరే నటీనటులను ఇబ్బంది పెట్టాలని కోరుకోడు. అయినా వాళ్లకు ఇలాంటివి చేసేంత సమయం ఉండదు. ఇండస్ట్రీ, మీడియాలలో ఉన్న జెలసీ కారణంగానే ఇవి పరిణామాలు జరుగుతున్నాయి. ట్రోలింగ్ అనేది తారల జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది పూనమ్‌ కౌర్‌. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ ఈ ఫ్యాన్స్‌ అకౌంట్స్‌ రాజకీయ కారణాలతో కొంతమంది క్రియేట్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేసింది. ట్రోల్స్ ఎవరు చేసినా చివరకు బ్లేమ్‌ అయ్యేది నటీనటులే అని తెలిపింది. అభిమానులు అమాయకులని, కొంత మంది రాజకీయ నాయకులే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలాంటి దారుణాలు చేస్తున్నారని అభిప్రాయపడింది పూనమ్. ఆమె చేసిన ఈ కామెంట్స్ , మీరా చోప్రా వివాదానికి రాజకీయ రంగు పూసినట్లైయింది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h1FJab
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...