ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అకస్మికంగా మృతి చెందారు. మురళి శర్మ తల్లి శ్రీమతి పద్మ శర్మ గారు రాత్రి ముంబై లోని నివాసంలో గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. ఆమె వయస్సు 76 సంవత్సరాలు. దీంతో మురళి శర్మ కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళి శర్మ ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. విలన్గా, తండ్రిగా, పోలీస్ ఆఫీసర్గా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. నటనపై ఆసక్తితో రోషన్ తనేజా ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడ శిక్షణ తీసుకొన్నాడు. అక్కడే దీపక్ తిజోరి, విక్రమ్భట్లతో పరిచయం ఏర్పడింది. వాళ్లు నిర్మించిన టీవీ సీరియల్స్లో నటించాడు. విక్రమ్భట్ తన హిందీ చిత్రం 'రాజ్ 'లో అవకాశం ఇచ్చాడు. తర్వాత షారుఖ్ఖాన్ మైహూనా లో నటించాడు. ఇంకొన్ని హిందీ సినిమాలలో చేశాడు. 2007లో తొలిసారిగా అతిథి అనే సినిమాలో నటించారు. ఆ తరువాత ఎన్టీఆర్ కంత్రి, ఊసరవెల్లి చిత్రాలలో నటించారు. ఐతే 2015లో వచ్చిన భలే భలే మగాడివోయ్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. మురళీ శర్మ. ఇటీవలే విడుదలైన అలవైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా మురళీ శర్మ నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zh2h5G
v
No comments:
Post a Comment