152వ చిత్రం ''కు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఏదో ఒక రూపంలో సమస్య వెంటాడుతూనే ఉంది. అప్పుడు 'సైరా నరసింహా రెడ్డి' షూటింగ్ డిలే కావడం మొదలుకొని నేటి RRR షూటింగ్, లాక్డౌన్ అన్నీ కూడా 'ఆచార్య'పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయనడంలో సందేహం లేదు. కొరటాల వద్ద బలమైన స్క్రిప్ట్ ఉన్నప్పటికీ దాన్ని కెమెరాలో బంధించడంలో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్నటి దాకా ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం మహేష్ బాబును ఫైనల్ చేశారని టాక్ వచ్చింది. అయితే చివరకు దానిపై క్లారిటీ వచ్చేసి.. చిరంజీవితో స్పెషల్ రోల్ చేయబోయేది మహేష్ బాబు కాదు అని కన్ఫర్మ్ అయింది. దీంతో మెగా అభిమానులు హుషారెత్తిపోయారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మరోసారి ఈ క్యారెక్టర్ రామ్ చరణ్ చేయడం కష్టమే అని, దానికి కారణం RRR షూటింగ్ అని వార్తలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. Also Read: లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్కి పర్మిషన్ రావడంతో రాజమౌళి తన RRR ప్రాజెక్టును ఫినిష్ చేయాలని ఫిక్సయ్యారు. దీంతో రామ్ చరణ్ ఆ ప్రాజెక్టు కోసమే లాక్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. RRR షూటింగ్ స్టార్ట్ అయితే రామ్ చరణ్ మరో షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉండదట. ఈ క్రమంలో చిరంజీవి కూడా 'ఆచార్య' షూటింగ్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో రామ్ చరణ్తో చేయించాలనుకున్న క్యారెక్టర్ వేరే హీరోతో చేయిస్తేనే బెటర్ అని, లేదంటే తమ సినిమా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని కొరటాలకు సలహా ఇచ్చారట చిరంజీవి. దీంతో కొరటాల శివ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని టాక్. చూడాలి మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/381JWGF
v
No comments:
Post a Comment