Thursday, 25 June 2020

త్వరలో సుశాంత్ చివరి సినిమా విడుదల.. అందరికీ ఫ్రీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ చివరి సారిగా నటించిన 'దిల్ బేచారా' సినిమా త్వరలో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడిన ఈ చిత్రం, వచ్చే నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమైంది. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఉచితంగా చూడవచ్చని, ఇది ప్రతి ఒక్కరి స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని, ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రమని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ముఖేశ్ మాట్లాడుతూ, సుశాంత్ తనకు తొలి చిత్రం నుంచే తెలుసునని, తామిద్దరమూ కలిసి సినిమా చేయాలని ఎన్నో కలలు కన్నామన్నారు. అన్నింటినీ మిగిల్చి అతను వెళ్లిపోగా, ఇప్పుడు తాను ఒంటరిగా సినిమాను విడుదల చేస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. సుశాంత్ ఆఖరి చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేసి తమకు చూపించాలని ఫ్యాన్స్ కోరినా, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీ మాధ్యమంగానే విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు. జూన్ 14న సుశాంత్ బంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతితో బాలీవుడ్ పరిశ్రమలోని నెపోటిజంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఉన్న బంధు ప్రీతియే సుశాంత్ చావుకు కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులపై సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్‌లో కూడా కేసులు నమోదు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31jNhzG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...