Monday, 4 May 2020

పవన్ కళ్యాణ్ సరసన అనుష్క!

పవర్ స్టార్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రెండేళ్లపాటు రాజకీయాలతో బిజీగా గడిపిన ఆయన.. విరామం తరవాత అంగీకరించిన తొలి చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్. బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ లాక్‌డౌన్ లేకపోయుంటే ఈపాటికి ముస్తాబై ఉండేది. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. వవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీ తీసిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం తన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండగల సాయన్న అనే గజదొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌ను ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కమర్షియల్ హంగులతో క్రిష్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో రాజ కుటుంబానికి చెందిన మహిళ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు బాలీవుడ్ వర్గాలు ఖరారు చేశాయి. Also Read: ఇదిలా ఉంటే, ఇప్పుడు పవన్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఆమెను క్రిష్ సంప్రదించారట. వీడియో కాల్ ద్వారా ఆమెకు స్క్రిప్ట్ వినిపించారని.. అది నచ్చడంతో పచ్చజెండా ఊపారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఇలాంటి పీరియాడిక్ మూవీస్‌లో నటించడం అనుష్కకు కొత్తేమీకాదు. ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘సైరా’ వంటి సినిమాల్లో అనుష్క తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. కాబట్టి, పవన్ సినిమాలో పాత్రకు అనుష్క అయితే న్యాయం చేస్తారని క్రిష్ ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు అనుష్క అంగీకరించడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W1mC7D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...