Wednesday, 6 May 2020

కీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్.. మోహన్ బాబు స్పెషల్ డిష్

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ లాక్‌డౌన్ సమయంలో చెఫ్‌గా మారారు. కొత్త కొత్త వంటకాలను ట్రై చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు రుచి చూపిస్తున్నారు. తాజాగా మోహన్ బాబు ఒక కొత్త వంటకం వండారు. దానికి ‘కీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్’ అని పేరు పెట్టారు. దీని కోసం మోహన్ బాబు స్వయంగా ఉల్లికాడలు కట్ చేశారు. దగ్గరుండి భార్య నిర్మలా దేవి, కుమార్తె లక్ష్మీ ప్రసన్నతో ఈ వంటకాన్ని వండించారు. ఈ వంటకాన్ని వండుతోన్న వీడియోను లక్ష్మీ ప్రసన్న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ థాయ్, ఇండియన్ స్టైల్ వంటకానికి మోహన్ బాబు.. ఉల్లిపాయలు, ఉల్లికాడలు, మిర్చి, సగం ఉడికించిన కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీన్స్, పచ్చి జీడిపప్పు, పితికి పప్పుతో చేసిన ఖీమాను వాడారు. ఈ వంటకం తయారు చేసేటప్పుడు మోహన్ బాబు చెప్పే కబుర్లు సైతం భలే గమ్మత్తుగా ఉన్నాయి. అనప గింజలను రాయలసీమలో పితికి పప్పు అని అంటారని మోహన్ బాబు చెప్పారు. మొత్తం మీద ఈ వీడియో ద్వారా ఒక కొత్త వంటకాన్ని చేసి చూపించారు మంచు ఫ్యామిలీ. ఇదిలా ఉంటే, ఈ లాక్‌డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చింది మంచు ఫ్యామిలీ. తన సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇలా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఇది కాకుండా ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dg2h46
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...