Thursday, 7 May 2020

ప్రభాస్‌కు విలన్‌గా తమిళ హీరో.. సెట్ చేసిన నాగ్ అశ్విన్!

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుమారు రూ.400 కోట్లతో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా తారాగణం విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన విలన్ పాత్రను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. తమిళ హీరో అరవింద్ స్వామిని ఖరారు చేశారని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. ఒకప్పుడు హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించారు. స్టైలిష్ విలన్‌గా మెప్పించారు. ఇప్పుడు ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తీయబోయే చిత్రం కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుందట. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి అయితేనే విలన్ పాత్రకు బాగుంటారని భావించి నాగ్ అశ్విన్ ఆయన్ని సంప్రదించారట. Also Read: ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్ర బృందం జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మొదట ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ టైటిల్ మారబోతోంది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది ఆఖరిలో ఈ సినిమా విడుదల ఉండొచ్చు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cgavcC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...