రంభ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగులో స్టార్ హీరోయిన్గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పెళ్లి చేసుకున్న తరవాత వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. రంభకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. తన కుటుంబంతో తీసుకున్న లేటెస్ట్ ఫొటోలను రంభ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రంభ ఫ్యామిలీ చాలా క్యూట్గా ఉంది. కెనడాలో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త ఇంద్రన్ను 2010 ఏప్రిల్లో రంభ పెళ్లిచేసుకున్నారు. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. 2011లో రంభ మొదటి బిడ్డ లావణ్యకు, 2015లో రెండో బిడ్డ శాషాకు జన్మనిచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తరవాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్తను వదిలిపెట్టి రంభ 2017లో కెనడా నుంచి చెన్నైకి వచ్చేశారు. Also Read: కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న రంభ.. మళ్లీ భర్త వద్దకు వెళ్లిపోయారు. ఈ విషయంలో రంభ కోర్టుకు కూడా వెళ్లారు. మొత్తానికి గొడవలు పక్కనబెట్టి కలిసి జీవించాలని ఇంద్రన్, రంభ నిర్ణయించుకున్నారు. 2018లో వీరికి మగబిడ్డ శివిన్కు రంభ జన్మనిచ్చారు. ప్రస్తుతం రంభ ఫ్యామిలీ కెనడాలో ఎంతో హ్యాపీగా జీవిస్తోంది. కాగా, 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రంభ. విజయవాడకు చెందిన ఈ తెలుగమ్మాయి తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో నటించారు. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు. ‘సర్గం’ అనే మలయాళ చిత్రం ద్వారా రంభ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను రెండేళ్ల తరవాత తెలుగులో ‘సరిగమలు’ పేరుతో విడుదల చేశారు. Also Read: 1992లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యారు రంభ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత స్టార్ హీరోలందరి సరసన నటించారు. కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించారు. చివరిగా ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్తో స్టెప్పులేశారు. నటిగా ‘దొంగసచ్చినోళ్లు’ రంభ ఆఖరి చిత్రం. 2008లో ఈ సినిమా విడుదలైంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YJ0AIr
v
No comments:
Post a Comment