రోజురోజుకి విజృంభిస్తోన్న భయంకర కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చారు. ఆదివారం దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. ప్రధాని పిలుపునకు దేశ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజల నుంచి ఇంత మంచి మద్దతు రావడం పట్ల బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ క్రమశిక్షణ అంటే ఇదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ముంబైలోని నిర్మానుష్యంగా ఉన్న మెరైన్ డ్రైవ్ ప్రాంతం వీడియోను అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ రోడ్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. దీన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు ఉదయం ముంబైలో మెరైన్ డ్రైవ్ ప్రాంతం.. జాతీయ క్రమశిక్షణ అంటే ఇది.. జై హింద్’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు, ‘జనతా కర్ఫ్యూ’కు సంబంధించిన ఆసక్తికర ట్వీట్లన్నింటినీ ఆయన రీట్వీట్ చేస్తున్నారు. ప్రధాని పిలుపునకు తన పూర్తి మద్దతును తెలుపుతున్నారు. ప్రజలను ఈ విషయంలో చైతన్యం చేస్తున్నారు. అమితాబ్తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ‘జనతా కర్ఫ్యూ’పై స్పందించారు. జనతా కర్ఫ్యూ ఆవశ్యకతను తెలుపుతూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. జనతా కర్ఫ్యూ అంటే పబ్లిక్ హాలీడే కాదని.. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించాలని, ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయకూడదని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్కు ఎవరూ అతీతులు కాదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ulc5BW
v
No comments:
Post a Comment