Sunday, 22 March 2020

జనతా కర్ఫ్యూ: అమ్మతో కలిసి ఆవకాయ కలిపిన నాగశౌర్య

భయంకర కరోనా వైరస్‌ను మన దేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలంతా ఏకమయ్యారు. ‘జనతా కర్ఫ్యూ’ను ఇబ్బందిగా కాకుండా తమవంతు బాధ్యతగా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తోన్న దేశ ప్రజలు.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ నగరంలో అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకరు ఇద్దరు రోడ్లపైకి వచ్చినా పోలీసులు వాళ్లకు నచ్చజెబుతున్నారు. కర్ఫ్యూకు మద్దతు తెలపాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తున్నారు. ఇక తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. నిజానికి వాళ్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కర్ఫ్యూకి మద్దతు తెలపాలని.. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే భద్రంగా ఉండాలని సూచిస్తున్నారు. కొంత మంది టాలీవుడ్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్ నిర్వహిస్తూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటున్నారు. ఇక ఇళ్లలో ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఇంట్లో చెస్ ఆడుతున్న ఫొటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వీడియోను నాగశౌర్య తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Also Read: జనతా కర్ఫ్యూతో ఇంటికే పరిమితమైన హీరో నాగశౌర్య.. ఆవకాయ ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆయన తల్లి ఉషా ముల్పూరి దగ్గరుండి నాగశౌర్యతో ఆవకాయ పెట్టించారు. అమ్మ ఇచ్చిన సూచనలను పాటిస్తూ నాగశౌర్య ఆవకాయను తన చేత్తో కలియగలిపారు. ఈ వీడియో చూడటానికి చాలా బాగుంది. మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dkmZk6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...