‘’.. పార్టీలు, ప్రభుత్వాలు కర్ఫ్యూ చేస్తే ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. కాని ప్రజలు స్వచ్ఛదంగా కర్ఫ్యూ పాటిస్తే ఎలా ఉంటుందో నేడు కళ్లారా చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని విధంగా ‘జనతా కర్ఫ్యూ’కి విశేష స్పందన లభించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రధాని మోడీ తలపెట్టిన జనాత కర్ఫ్యూకి మంచి స్పందన లభించింది. ప్రజలంతా ఇంటి నుండి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. ఎప్పుడూ పొల్యుషన్తో నిండిపోయే హైదరాబాద్ నగరం ప్రశాంతంగా మారిపోయింది. రోడ్లపైన పిట్ట కూడా కనిపించడం లేదు. సామాన్య జనంతోపాటు సెలబ్రిటీలు సైతం ఈ జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో హీరో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఇన్నాళ్లు పొల్యుషన్ కోరల్లో చిక్కుకుని తన ఇంట్లో ఉన్న ఓ అతిథి గురించి పట్టించుకోలేదట. అయితే నగరం మొత్తం ప్రశాంతంగా ఉడటంతో ఆ విశిష్ట అతిథి కిచకిచలు ఎట్టకేలకు నానికి వినబడ్డాయి. ఆ అతిథి ఎవరో కాదు.. ఓ పక్షి. అవును.. తన ఇంటి బాల్కనీలోని చెట్టుపై గూడు కట్టుకుని అక్కడే పిల్లని పొదిగిన ఓ పక్షిని చూపిస్తూ ఆసక్తికరమైన వీడియోని షేర్ చేశారు నాని. ‘ఊరంతా సైలెంట్గా ఉంది.. ఇన్నాళ్లు పొల్యుషన్, శబ్ధాల వల్ల చాలా విషయాలు తెలియలేదు. అయితే ఈరోజు ఊరంతా సైలెంట్గా ఉండటం వల్ల కొత్త విషయం తెలిసింది. మన ఇంట్లో.. మన బాల్కనీలో ఏముందో మీరే చూడండి’ అంటూ చెట్టుపై గూటిలో ఓ పక్షి తన పిల్లతో కలిసి కిచకిచమంటూ శబ్ధాలు చేస్తున్న బ్యూటిఫుల్ నేచురల్ వీడియోను ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా షేర్ చేశారు నేచురల్ స్టార్ నాని.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3blMwYB
v
No comments:
Post a Comment