Monday, 24 February 2020

Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలిసిన తమన్.. ఒళ్లంతా చెమటలు పట్టేసాయట!

పవర్‌స్టార్ ప్రస్తుతం ‘పింక్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తాను అందిస్తున్న మ్యూజిక్ గురించి చర్చించేందుకు ఈరోజు తమన్.. పవన్ ఇంటికి వెళ్లారట. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘‘ఈరోజు కలలా ఉంది. ఎప్పటినుంచో నేను ఆయనతో కలిసి పనిచేయాలని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు కంపోజ్ చేసిన పాటలన్నీ పవన్‌కు వినిపించాను. చాలా కంగారుపడ్డాను. చెమలు పట్టేసాయి. అయితే అది భయం వల్ల కాదు. ఆయన పట్ల నాకున్న ప్రేమ, ఒత్తిడి వల్ల. మొత్తానికి ఆయనకు నా పాటలు నచ్చాయి. త్వరలో ఫస్ట్ పాటతో మీ ముందుకు రాబోతున్నాను. లవ్యూ సర్’ అని పేర్కొన్నారు. అయితే ఆయన పెట్టిన పోస్ట్‌లో ఎక్కడా పవన్ కళ్యాణ్‌ను కలిసానని ఎక్కడా చెప్పలేదు. కానీ తమన్ కలిసింది కచ్చితంగా పవన్‌నే అంటున్నాయి పలు వెబ్‌సైట్లు. అదీకాకుండా మొన్న తమన్ పవన్ కళ్యా్ణ్‌కు సంబంధించి ఒక ట్వీట్ చేసారు. READ ALSO: ఈ సినిమాలో సెన్సేషనల్ సింగర్ సిధ్ శ్రీరామ్ ఓ పాట పాడబోతున్నారని అన్నారు. అది నిజమేనంటూ తమన్ ట్వీట్ చేసారు. ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ రావడంలేదు. టైటిల్ విషయంలో అయితే ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. పవన్‌కు జోడీగా ఎవరు నటించనున్నారు, ఇతర సహాయ పాత్రల్లో నటించే అవకాశం ఎవరికి దక్కింది అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SUCZRM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...