Monday, 24 February 2020

ఫొటోగ్రాఫర్‌పై మహేష్ కామెంట్.. ఎన్టీఆర్‌ను మించిపోయాడుగా!

సూపర్ స్టార్ రియల్ లైఫ్ లో చాలా కూల్ గా ఉండే వ్యక్తి. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉంటారు. ఎవరితోనూ అనవసరంగా పెట్టుకోడు. ఎంత వరకు మాట్లాడాలో అంతే మట్లాడి ఊరుకునే టైప్. అయితే మహేష్ కామెడీ చేస్తే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. ఈ విషయాన్ని ఓసారి సమంతే చెప్పారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్ టైంలో మహేష్ సైలెంట్‌గా ఉంటూ వేసిన పంచ్‌లకు నవ్వలేక చచ్చేవాళ్లమని అన్నారు. సరే.. ఈ విషయం అటుంచితే.. పొద్దున్న మహేష్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అయితే అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్లు చకచకా మహేష్ ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు మహేష్.. ఆ ఫొటోగ్రాఫర్‌పై ఫన్నీగా కామెంట్స్ చేసారంట. ‘ఆపమ్మా ఆపు. ఎప్పుడూ మీకు ఇదే పనా బోర్ కొట్టట్లేదా నీకు’ అన్నారట. ఆ టైంలో తీసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. తారక్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వెళ్తుంటే.. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ తారక్ వెంటే వెళుతున్నాడు. READ ALSO: అప్పుడు తారక్ అతనితో మాట కలుపుతూ.. ‘మీరు ఇక్కడే ఉంటారా అండీ. తిండి స్నానం అన్నీ ఇక్కడేనా’ అని సరదాగా ఆటపట్టించాడట. తారక్ ప్రశ్నలకు ఆ ఫొటోగ్రాఫర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మన స్టార్ సెలబ్రిటీలు బయటివారితో ఇలా కూల్‌గా మాట్లాడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవనుకోండి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ఆయన వంశీ పైడిపల్లితో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని టాక్. ‘గరుడవేగ’ సినిమాను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారుతో కలిసి పనిచేయబోతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2upZGnz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...