Wednesday, 5 February 2020

సూపర్ స్టార్ సినిమాకి నష్టాలు, డిస్ట్రిబ్యూటర్స్ ధర్నా

‘ఆట ఎవరైనా ఆడొచ్చు, కానీ సింహాసనం ఎప్పుడూ చక్రవర్తిదే’.. అంటూ బాక్సాఫీస్ రికార్డుల్ని దుమ్ముదులేపేసింది సూపర్ స్టార్ దర్బార్ చిత్రం. రజినీకాంత్‌కి ఉన్న స్టామినా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌తో తొలిరోజే ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసింది. జనవరి 9న విడుదలైన ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా అప్పట్లో అధికారికంగా ప్రకటించింది లైకా ప్రొడక్షన్స్. మొత్తంగా ఈ సినిమా రూ. 250కోట్ల గ్రాస్‌కు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లపైగానే ఖర్చు చేసింది లైకా సంస్థ. అయితే నిర్మాణ సంస్థకు లాభాలు తీసుకువచ్చినా పంపిణీదారులు దాదాపు రూ. 70 కోట్లమేర నష్టపోవడంతో ధర్నా చేయడానికి రెడీ కావడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ తమకు న్యాయం చేయాలని.. కోట్లలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ రజినీకాంత్ ఇంటిని ముట్టడించేందుకు శనివారం నాడు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే పోలీసుల సంరక్షణలో రజినీకాంత్ ఇళ్లు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నం ఫలించలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ‘దర్భార్’ డిస్ట్రిబ్యూటర్స్ నిరాహార దీక్ష చేయడానికి సిద్దమయ్యారట. వెంటనే సూపర్ స్టార్ స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని లేదంటే.. తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు ‘దర్బర్’డిస్ట్రిబ్యూటర్స్. గతంలో కూడా రజినీకాంత్ ‘బాబా’, ‘లింకా’, ‘రోబో 2’ చిత్రాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టాలపాలయ్యారు. రజినీ పెద్ద మనసుతో వారిని కొంతమేర ఆదుకున్నారు. దర్భార్ చిత్రానికి ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. నివేదా థామస్ రజినీకి కూతురుగా నటించారు. తమిళ, తెలుగు, హిందీ భాషలలో జనవరి 9వ తేదీ రిలీజ్ అయ్యి ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/398OH0l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...