మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ దేవ్ తొలి సినిమా ‘విజేత’తో పర్వాలేదనిపించారు. సినిమా కమర్షియల్గా పెద్దగా ఆడకపోయినా ఒక మంచి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారనే పేరును కళ్యాణ్ దేవ్ సంపాదించారు. తొలి సినిమా తరవాత ఏడాదిన్నరకు పైగా విరామం తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు తన రెండో చిత్రాన్ని ప్రకటించారు. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా ద్వారా మరో రచయిత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతిరోజు పండగే’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ కళ్యాణ్ దేవ్ రెండో సినిమాను సమర్పిస్తోంది. ‘వెంకీ మామ’తో విజయాన్ని అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మాతలు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతోన్న శ్రీధర్ సీపాన గతంలో ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు. అలాగే.. ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’, ‘భీమవరం బుల్లోడు’, ‘లౌక్యం’, ‘సౌఖ్యం’, ‘డిక్టేటర్’ చిత్రాలకు కథ, మాటలు రచించారు. Also Read: దర్శకునిగా పరిచయమవుతున్న నేపథ్యంలో శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. ‘‘దర్శకునిగా పరిచయం కావటానికి రచయితగా నాకున్న అనుభవంతో ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నాను. ఈ కథకు హీరోగా కళ్యాణ్ దేవ్ అయితే సరిగ్గా సరిపోతారని అనిపించింది. ప్రేమకథతో కూడిన వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు సర్వదా కృతజ్ఞుడను. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తదితర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31qGQJ3
v
No comments:
Post a Comment