Monday, 24 February 2020

శ్రీదేవి వద్దన్న పనే చేస్తున్నారు.. ఆమె మాటంటే గౌరవం లేదా?

అలనాటి దివంగత నటి నటించిన అద్భుతమైన సినిమాల్లో ‘మిస్టర్ ఇండియా’ ఒకటి. అనిల్ కపూర్, శ్రీదేవి, అమ్రిష్ పూరీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ సినిమాను నిర్మించారు. శేఖర్ కపూర్ డైరెక్ట్ చేసారు. అయితే ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమాలను ఇప్పటి తరాలు చాలా సులువుగా సీక్వెల్స్ పేరుతో ఎలా పడితే అలా తెరకెక్కించేస్తున్నాయి. కానీ అలా తీసిన సీక్వెల్ సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు. రెండేళ్ల క్రితం ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు కూడా సీక్వెల్ తీయాలని అనుకున్నారు. కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు. ఇలాంటి సినిమాలను సీక్వెల్స్ పేరుతో మళ్లీ టచ్ చేయకపోవడమే మంచిదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఉన్నట్టుండి ‘మిస్టర్ ఇండియా ట్రైలాజీ’ అంటూ సీక్వెల్ ప్రకటించేసారు. త్వరలో సినిమాలోని నటీనటుల వివరాలు ప్రకటిస్తాను అన్నారు. దాంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. అయితే అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మాత్రం అలీపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించేముందు మా నాన్న అనుమతి కానీ దర్శకుడు శేఖర్ కపూర్ అనుమతి కానీ తీసుకోలేదు. ఇది గౌరవం అనిపించుకోదు. మొన్ననే బోనీ కపూర్, మా నాన్న కలిసి చర్చించుకున్నారు. ఈ సినిమా రైట్స్ శేఖర్ కపూర్ వద్దే ఉన్నాయి’’ అన్నారు. అయితే దీనిపై అలీ అబ్బాస్ మాత్రం స్పందించలేదు. అయితే శ్రీదేవి బతికున్నప్పుడు తన సినిమాకు సీక్వెల్ తీయొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆమెపై గౌరవం ఉంచకుండా అసలు సినిమాతో సంబంధం లేని దర్శకుడు సీక్వెల్ ప్రకటించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి చనిపోయాక ఆమె మాటను కూడా గాలికొదిలేసారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wIoA2w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...