Tuesday, 11 February 2020

చనిపోయేముందు నన్ను కలవాలనుకుంది: విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్

రౌడీ బాయ్ నిన్న తన ఫ్యాన్స్‌ కోసం సన్‌డౌనర్ పార్టీ ఏర్పాటుచేసారు. తాను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన రౌడీ బ్రాండ్ గురించి, ఏడాదిలోనే తన బ్రాండ్‌ పాపులారిటీ పెరిగిపోవడం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ ఏడాది క్రితం తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. విజయ్ ‘నోటా’ సినిమా చేస్తున్న సమయంలో మోహిత్ అనే అభిమాని నుంచి చాలా సార్లు ఫోన్లు వచ్చాయట. అతని తల్లి చావు బతుకుల మధ్య ఉందని, ఒక్కసారి విజయ్‌ని కలవాలన్నది ఆమె కోరికట. ఈ విషయం విజయ్‌కి తెలిసినా వర్క్‌లో పడి పట్టించుకోలేదట. ఆ తర్వాత మోహిత్ తల్లి ఆరోగ్యం విషమించిందని తెలిసి విజయ్ షాకయ్యాడట. వెంటనే మోహిత్ వాళ్ల అమ్మను కలిసాడు. అప్పుడు మోహిత్ తల్లి విజయ్‌తో మాట్లాడుతూ.. ‘నా బిడ్డకు యాక్టర్ అవ్వాలని కోరిక. ఎప్పటినుంచో ఆడిషన్స్ ఇస్తున్నాడు కానీ అవకాశాలు రావడంలేదు. వాడిని ప్రోత్సహించడానికి నేను ఎక్కువ రోజులు బతికి ఉండను’ అని చెప్పారు. ఈ మాట విన్న విజయ్‌కి ఏం చేయాలో అర్థంకాలేదట. READ ALSO: కానీ నోటా రిలీజ్ తర్వాత రౌడీ ఈవెంట్స్‌కు సంబంధించి కొరియోగ్రఫీ ఏర్పాట్లన్నీ మోహితే దగ్గరుండి చూసుకునేవాడట. ఈ విషయం తెలిసి తాను షాకయ్యానని విజయ్ అన్నాడు. కాసేపు ఏమీ మాట్లాడలేక బాధను దిగమింగుకున్నాడు. ఆ తర్వాత మోహిత్‌ను తన ఫ్యాన్స్‌కి పరిచయం చేసాడు. విజయ్ మాటలకు సన్‌డౌనర్ పార్టీకి వచ్చిన ఓ మహిళ కన్నీరుపెట్టుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయింది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ONoj4o
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...