మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరిట ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి తన తండ్రిని రీలాంచ్ చేశారు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్నారు. ఇక ‘సైరా’ సినిమాతో నిర్మాతగా తన స్టామినాను చాటుకున్నారు. ఇప్పుడు చిరంజీవి, కొరటాల శివ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాతగానూ సక్సెస్ అయిన రామ్ చరణ్ భవిష్యత్తులో తన బ్యానర్లో మరిన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ రైట్స్ను చరణ్ కొనుగోలు చేశారు. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవి హీరోగా పెట్టి తీయాలని చరణ్ ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. Also Read: ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో మలయాళ సినిమా రైట్స్ను చరణ్ కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమా రీమేక్ రైట్స్ను చరణ్ కొన్నారట. పృథ్వీరాజ్ హీరోగా నటించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ కిందటేడాది డిసెంబర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఒక స్టార్ హీరో తన డ్రైవింగ్ లైసెన్స్ను కోల్పోవడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ సినిమాను తానే హీరోగా చరణ్ నిర్మిస్తారో.. లేదంటే మెగా కాంపౌండ్లో మరో హీరో చేతికి ఇస్తారో చూడాలి. కాగా, ప్రస్తుతం చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్తో పాటు ఎన్టీఆర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. See Photo Story:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uKeail
v
No comments:
Post a Comment