వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారం మరోసారి రచ్చకెక్కెంది. శ్రీరెడ్డిపై మరో నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి మాట్లాడుతుందని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. See Photo Story: ఇటీవల కాలంలో శ్రీరెడ్డి, కరాటే కళ్యాణిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కళ్యాణి పలు యూట్యూబ్ ఛానెళ్లలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనికి శ్రీరెడ్డి కౌంటర్ ఇస్తూ రెండు రోజుల క్రితం ఫేస్బుక్ లైవ్లో రెచ్చిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి తన ఇంట్లో నుంచే నిర్వహించిన ఫేస్బుక్ లైవ్లో బూతు పురాణం అందుకుంది. కరాటే కళ్యాణిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పదజాలంతో తిట్టిపోసింది. తన గురించి మరోసారి మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించింది. Also Read: శ్రీరెడ్డి ఎదురుదాడితో కరాటే కళ్యాణి పోలీసులను ఆశ్రయించింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి బూతుపురాణంతో తీవ్ర మనస్థాపానికి గురైన కళ్యాణి ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అవసరమైన పక్షంలో శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. మరి దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. See Photo Story:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P3Uk8A
v
No comments:
Post a Comment