Saturday, 15 February 2020

ఆరోగ్యంగా తిరిగి నా దగ్గరకు వస్తారనుకున్నా: దర్శకుడి మృతిపై చిరంజీవి సంతాపం

దర్శకుడు రాజ్ కుమార్ మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాది రాళ్లు’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈరోజు అనారోగ్యంతో కన్నుమూసారు. రాజ్‌కుమార్ మరణంపై చిరంజీవి మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘నేను అప్పుడే నటనలో శిక్షణ తీసుకుంటున్న రోజులవి. ఓసారి రాజ్‌కుమార్ గారు నన్ను చూసి ‘పునాది రాళ్లు’ అనే సినిమా తీస్తున్నానని అందులో నేను నటించాలని అన్నారు. నేను ఇంకా నటనలో శిక్షణ తీసుకుంటున్నాను కాబట్టి నటించలేను అని చెప్పాను. అయినా ఆయన వినలేదు. నేనే ఆయన సినిమా చేయాలన్నారు" "దాంతో ఆయన కోసమే ఆ సినిమాకు ఒప్పుకున్నాను. నా నట జీవితానికి అదే “పునాది రాళ్లు” వేసింది. ఈ మధ్యనే మా ఇంటికి వచ్చి కలిశారు. అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాను. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అనుకున్నాను ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అన్నారు. READ ALSO: రాజ్‌కుమార్‌ .. 1977లో ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఎలాగోలా సినిమా రిలీజ్‌ చేయగా 5 నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లెతో కలిపి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీసారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bFo8BY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...